
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా హాల్లోకి అనుమతించబోమని ఇంటర్ బోర్డు అధికారులు చెప్పారు. విద్యార్థులు 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా… అదనపు బస్సు సర్వీస్లు నడుపుతున్నట్లు తెలిపారు. విద్యార్ధులను నేలమీద కూర్చోబెడితే ఆ కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి చిత్రా రామచంద్రన్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. ఎగ్జామ్ సెంటర్ లొకేటర్ యాప్ ద్వారా పరీక్షా కేంద్రాన్ని గుర్తించొచ్చన్నారు రామచంద్రన్. ఇంటర్బోర్డు అధికారిక వెబ్సైట్ నుంచి విద్యార్థులు తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకొనే అవకాశాన్ని కల్పించారు బోర్డు అధికారులు.