V6 News

తల్లి మందలించిందని బాలిక సూసైడ్ ..పురుగుల మందు తాగి ..చికిత్సపొందుతూ మృతి

తల్లి మందలించిందని బాలిక సూసైడ్ ..పురుగుల మందు తాగి ..చికిత్సపొందుతూ మృతి
  • మంచిర్యాల జిల్లా పొన్నారంలో ఘటన

కోల్​బెల్ట్​, వెలుగు:  తల్లి మందలించడంతో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. రామకృష్ణాపూర్​ఎస్ఐ రాజశేఖర్​తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రి మండలం పొన్నారం గ్రామానికి చెందిన విద్యార్థిని మాసు అక్షర(15) ను అన్నం తినమని తల్లి సావిత్రి మందలించింది. 

దీంతో  తీవ్ర మనస్తాపం చెందిన బాలిక ఈనెల1న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నిచింది. తండ్రి సంతోష్​వెంటనే ఆమెను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికకు సీరియస్ గా ఉండడంతో మెరుగైన వైద్యానికి కరీంనగర్​ప్రతిమ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక శుక్రవారం ఉదయం మృతి చెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.