జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: నగరానికి చేరుకున్న బ్యాలెట్‌ బాక్సులు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: నగరానికి చేరుకున్న బ్యాలెట్‌ బాక్సులు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం హైదరాబాద్ నగరానికి బ్యాలెట్‌ బాక్సులు చేరుకున్నాయి. ఏపీ నుంచి న‌గ‌రానికి చేరుకున్న 15000 బాక్సులను విక్టోరియా ప్లే గ్రౌండ్‌ లో అధికారులు భద్రపరిచారు. బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు అని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించిన మరునాడే అధికారులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి బ్యాలెట్‌ బాక్సులు తెప్పిస్తున్నారు. విశాఖపట్టణం నుంచి 4,750, చిత్తూరు నుంచి 950 బాక్సులను పది లారీల్లో తీసుకువచ్చారు. ఈ బాక్సులను చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్‌లో భద్రపర్చారు.

నాలుగైదు రోజుల్లో ఏపీలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు 29 వేల బాక్సులు నగరానికి చేరుకుంటాయని అధికారులు తెలిపారు. విక్టరీ ప్లే గ్రౌండ్‌లోని భవనంలో స్థలం సరిపోకుంటే హరిహరా కళాభవన్‌లో బ్యాలెట్‌ బాక్సులు ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కొవిడ్‌ నేపథ్యంలో నగరంలో 11,500 నుంచి 12 వేల వరకు పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో కనీసం 30 వేలకుపైగా బాక్సులు అవసరమని భావిస్తున్నారు. తెలంగాణ నుంచి ఏపీలోని స్థానిక సంస్థల ఎన్నికల కోసం తరలించిన బాక్సులను తిరిగి తీసుకువస్తున్నారు.