మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సూన్ రెగట్టా పోటీలు షురూ

మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సూన్ రెగట్టా పోటీలు షురూ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సూన్ రెగట్టా 15వ ఎడిషన్ పోటీలు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని హుస్సేన్ సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సోమవారం మొదలయ్యాయి.  తొలి రోజు వర్షం, బలమైన గాలుల్లోనే వివిధ కేటగిరీల్లో సెయిలర్లు హుస్సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్ జలాలపై దూసుకెళ్లారు. అండర్-16 ఆప్టిమిస్ట్ క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ సెయిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పల్లార గోవర్దన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తమిళనాడుకు చెందిన శ్రేయ కృష్ణ సత్తా చాటారు.

ఒక రేసులో గెలిచి, మరో రేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చెరో మూడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. ఐఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ4 అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–18 క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సోమ్యా సింగ్ మొత్తం మూడు రేసులను గెలుచుకుని టాప్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించగా, ఐఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ4 బాయ్స్ విభాగంలో  ఏకలవ్య బాథమ్ సత్తా చాటాడు.