ఏపీలో కొత్తగా 1,732 కరోనా కేసులు, 14 మంది మృతి

ఏపీలో కొత్తగా 1,732 కరోనా కేసులు, 14 మంది మృతి

అమ‌రావ‌తి: ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,732 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 8,47,977కి చేరింది. ఇందులో 20,915 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,20,234 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ కారణంగా 14 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,828కు చేరుకుంది. ఇక జిల్లాల వారీగా .. అనంతపురం 97, చిత్తూరు 198, తూర్పుగోదావరి 344, గుంటూరు 195, కడప 88, కృష్ణా 246, కర్నూలు 24, నెల్లూరు 89, ప్రకాశం 24, శ్రీకాకుళం 59, విశాఖపట్నం 75, విజయనగరం 66, పశ్చిమ గోదావరి 227 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.