దక్షిణాసియాలో అతిపెద్ద.. పౌల్ట్రీ ఎక్స్‌పోకు హైదరాబాద్ ఆతిథ్యం

దక్షిణాసియాలో అతిపెద్ద.. పౌల్ట్రీ ఎక్స్‌పోకు హైదరాబాద్ ఆతిథ్యం
  • ప్రారంభించిన మంత్రులు పొన్నం, తుమ్మల

హైదరాబాద్​, వెలుగు:  దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఈవెంట్ అయిన 17వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌పోను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ హైదరాబాద్​ హైటెక్స్​లో ప్రారంభించారు. ఇండియన్​ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్​ మ్యానుఫ్యాక్చరర్స్​ అసోసియేషన్​ ఈ ఎక్స్‌‌‌‌‌‌‌‌పోను మంగళవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తోంది.  

ఈ సందర్భంగా  పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భవిష్యత్​లో పౌల్ట్రీ పరిశ్రమకు మంచి ఆదరణ లభిస్తుందని, గుడ్లు, చికెన్​ ఉత్పత్తిలో తెలంగాణ ముందువరుసలో ఉందని తెలిపారు.  టెక్నాలజీలతో తక్కువ సమయంలో శ్రమ లేకుండా పని చేయవచ్చని, యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. సీఎం రేవంత్​ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం వ్యవసాయంతోపాటు  వ్యవసాయేతర పరిశ్రమలకూ ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తుమ్మల అన్నారు. 

ఫార్మా, సీడ్​, వ్యవసాయ రంగాలలో తెలంగాణ దేశంలో ముందంజలో ఉండాలనే లక్ష్యంతో  పని చేస్తోందని చెప్పారు. పౌల్ట్రీ రంగంలోని కొత్త పద్ధతులను, అధునాతన టెక్నాలజీలను ప్రదర్శించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. బ్రీడింగ్, హాచరీ  ఆటోమేషన్, ఫీడ్​ మిల్లింగ్, వెటర్నరీ  ప్రొడక్ట్స్, హౌసింగ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ వంటి విభాగాలలో కొత్త పరికరాలను, టెక్నాలజీలను ప్రదర్శిస్తున్నారు.