పిడుగుపాటుకు 18 గొర్రెలు మృతి

పిడుగుపాటుకు 18 గొర్రెలు మృతి

రాష్ట్రంలో అకాల వర్షాలు రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుండగా, మరి కొందరికి లెక్కకు మంచిన ఆర్థిక నష్టాన్ని కలగజేస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఏప్రిల్ 6న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

ఈ క్రమంలో గాజులగట్టు గ్రామంలో పిడుగుపాటుకు గురై 18 గొర్రెలు మృతి చెందాయి. మరో 12 గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయి. కొత్తగూడ మండలంలోనూ ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.  పొగుళ్లపల్లి అంగన్వాడీ కేంద్రం భవనంపై చెట్టు విరిగిపడింది. ఆ సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.