గంగా పుష్కరాలకు 18 స్పెషల్ ట్రైన్లు

గంగా పుష్కరాలకు 18 స్పెషల్ ట్రైన్లు

సికింద్రాబాద్, వెలుగు : దేశంలో గంగా పుష్కరాలను పురస్కరించుకుని ఈ నెల 22 నుంచి మే 9 వరకు దక్షిణ మధ్య రైల్వే 18 స్పెషల్​ట్రైన్లను నడుపనుంది. మన రాష్ట్రంలో సికింద్రాబాద్,​-రక్సాల్​ మధ్య ఈ నెల 23, 30, మే 7న ఈ రైళ్లను నడుపనుంది. అలాగే రక్సాల్–​- సికింద్రాబాద్​మధ్య ఈ నెల 25, మే2,9 తేదీల్లో పరుగులు పెడతాయి.

తిరుపతి–- దనాపూర్ మధ్య ఈ నెల 22,29, మే6 తేదీల్లో , ధనాపూర్–​ -తిరుపతి మధ్య  ఈ నెల 24, మే1,8 తేదీల్లో నడుస్తాయి.  గుంటూరు– -బెనారస్​ మధ్య ఈ నెల 24, 29, మే 6వ తేదీల్లో ..బెనారస్– ​-గుంటూరు మధ్య ఈ నెల 24, మే 1,8వ తేదీల్లో ఈ రైళ్లు నడుస్తాయి.ఏసీ2 టయర్, ఏసీ 3 టయర్, ఏసీ 3 టయర్​ఎకానమి, స్లీపర్​ క్లాస్​ కోచ్​లతో పాటు జనరల్ ​బోగీలు అందుబాటులో ఉంటాయి.  శుక్రవారం నుంచి ప్యాసింజర్లు టికెట్లు బుక్​చేసుకోవచ్చు.