ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు గంటలో దోపిడీని కేసును ఛేదించారు. ఆదిలాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్న మునేశ్వర్ గౌరవ్ అనే వ్యక్తి శనివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వాహనంపై వచ్చి అతడిని అడ్డుకొని అతడి వద్ద ఉన్న రూ.1050 నగదు, మొబైల్ లాక్కెళ్లారు. ఈ ఘటనపై ఆదివారం ఉదయం 10 గంటలకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ బాధితుడు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆదిలాబాద్కు చెందిన గజ్జె కరణ్, షేక్ మోయిన్, అర్బాజ్ ఖాన్ను నిందితులుగా గుర్తించి గంటలోపే వారిని పట్టుకున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు. జల్సాలకు అలవాటుపడి దొంగతనం చేశారని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి దోపిడీ చేసిన నగదు, సెల్ఫోన్, వాహనాన్ని స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన్లు చెప్పారు.
