కుత్బుల్లాపూర్, వెలుగు: హైదరాబాద్ శివార్లలోని కుత్బుల్లాపూర్లో ఓ ఏడాదిన్నర పిల్లాడికి కరోనా పాజిటివ్రాగా.. అతని తల్లికి మాత్రం నెగిటివ్ వచ్చింది. ఆమె అత్తగారి ఫ్యామిలీ, తల్లిగారి ఫ్యామిలీల్లో అందరికీ వైరస్ సోకినా ఆమెకు రిజల్ట్స్లో నెగిటివ్ వచ్చింది. డాక్టర్లు మరోసారి ఆమె శాంపిల్స్ టెస్టులకు పంపించారు. కుత్బుల్లాపూర్కు చెందిన ఓ వ్యక్తి నెల రోజుల కింద ఢిల్లీ వెళ్లొచ్చాడు. తర్వాత తీవ్ర జ్వరంతో లోకల్గా ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో గాంధీ హాస్పిటల్కు వెళ్లగా కరోనా అని తేలింది. అక్కడే ట్రీట్మెంట్తీసుకుంటూ చనిపోయాడు. తర్వాత చేసిన టెస్టుల్లో ఆయన ఫ్యామిలీలో అందరికీ కరోనా పాజిటివ్వచ్చింది. కానీ ఆ ఇంటి కోడలు మాత్రం టెస్టులు చేయించుకోకుండా ఏడాదిన్నర బాబును తీసుకుని తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. ఆమెను ట్రేస్ చేసి తల్లిగారింటికి వెళ్లగా.. మళ్లీ తప్పించుకుని తెలిసినవారి ఇంట్లో ఆశ్రయం పొందింది. అధికారులు తల్లిగారింటి వారికి టెస్టులు చేయించగా అందరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. చివరికి ఆమెను గుర్తించారు. ఆమెకు, బాబుకు టెస్టులు చేయించగా.. బాబుకు పాజిటివ్ వచ్చింది, ఆమెకు మాత్రం నెగిటివ్ వచ్చింది. ఆమెకు ఇమ్యూనిటీ పవర్కారణంగా వైరస్అటాక్కాలేదా, లేక వచ్చి తగ్గిపోయిందా అనేది డాక్టర్లు పరిశీలిస్తున్నారు.
