కుత్బుల్లాపూర్, వెలుగు: హైదరాబాద్ శివార్లలోని కుత్బుల్లాపూర్లో ఓ ఏడాదిన్నర పిల్లాడికి కరోనా పాజిటివ్రాగా.. అతని తల్లికి మాత్రం నెగిటివ్ వచ్చింది. ఆమె అత్తగారి ఫ్యామిలీ, తల్లిగారి ఫ్యామిలీల్లో అందరికీ వైరస్ సోకినా ఆమెకు రిజల్ట్స్లో నెగిటివ్ వచ్చింది. డాక్టర్లు మరోసారి ఆమె శాంపిల్స్ టెస్టులకు పంపించారు. కుత్బుల్లాపూర్కు చెందిన ఓ వ్యక్తి నెల రోజుల కింద ఢిల్లీ వెళ్లొచ్చాడు. తర్వాత తీవ్ర జ్వరంతో లోకల్గా ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో గాంధీ హాస్పిటల్కు వెళ్లగా కరోనా అని తేలింది. అక్కడే ట్రీట్మెంట్తీసుకుంటూ చనిపోయాడు. తర్వాత చేసిన టెస్టుల్లో ఆయన ఫ్యామిలీలో అందరికీ కరోనా పాజిటివ్వచ్చింది. కానీ ఆ ఇంటి కోడలు మాత్రం టెస్టులు చేయించుకోకుండా ఏడాదిన్నర బాబును తీసుకుని తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. ఆమెను ట్రేస్ చేసి తల్లిగారింటికి వెళ్లగా.. మళ్లీ తప్పించుకుని తెలిసినవారి ఇంట్లో ఆశ్రయం పొందింది. అధికారులు తల్లిగారింటి వారికి టెస్టులు చేయించగా అందరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. చివరికి ఆమెను గుర్తించారు. ఆమెకు, బాబుకు టెస్టులు చేయించగా.. బాబుకు పాజిటివ్ వచ్చింది, ఆమెకు మాత్రం నెగిటివ్ వచ్చింది. ఆమెకు ఇమ్యూనిటీ పవర్కారణంగా వైరస్అటాక్కాలేదా, లేక వచ్చి తగ్గిపోయిందా అనేది డాక్టర్లు పరిశీలిస్తున్నారు.
ఏడాదిన్నర బాబుకు కరోనా పాజిటివ్..తల్లికి నెగిటివ్
- లేటెస్ట్
- April 23, 2020
లేటెస్ట్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- GT vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. టోర్నీ నుండి గుజరాత్ ఔట్
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- 100 శాతం పోలింగ్ .. ఆదర్శంగా నిలిచిన తండా
- Rajinikanth Vettaiyan: తలైవా సినిమాపై కొత్త అప్డేట్..రజినీకాంత్ ఆ మూవీ సెట్లో చివరి రోజు..
- కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు
- అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారు : కేటీఆర్
- Vetrimaaran-Suriya: వెట్రిమారన్ డబుల్ అప్డేట్స్..సూర్య వాడివాసల్ షూటింగ్కి ముహూర్తం ఫిక్స్!
- కాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
- హెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
Most Read News
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు