నిజామాబాద్​ జిల్లా ప్రజావాణిలో 197  ఫిర్యాదులు : కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు

నిజామాబాద్​ జిల్లా ప్రజావాణిలో 197  ఫిర్యాదులు : కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు

నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలోని కలెక్టరేట్లలో  సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 197 ఫిర్యాదులు వచ్చాయి. నిజామాబాద్​ కలెక్టరేట్​లో  కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో అధికారులు  121 ఫిర్యాదులు స్వీకరించారు.  డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లు, కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు అధికంగా వచ్చాయి. సంబంధిత అధికారులు ఫిర్యాదులను పరిశీలించి తర్వగా పరిష్కరించాలని కలెక్టర్​ ఆదేశించారు. అదనపు కలెక్టర్లు​ అంకిత్​, కిరణ్​కుమార్, జడ్పీ సీఈవో సాయాగౌడ్​, డీపీవో శ్రీనివాస్, ఇన్​చార్జి ఆర్డీవో స్రవంతి, ఏసీపీ రాజావెంకట్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

కామారెడ్డి కలెక్టరేట్​లో 76 ఫిర్యాదులు 

కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి కలెక్టరేట్​లోని ప్రజావాణికి 76 ఫిర్యాదులు వచ్చాయి.   కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​, అడిషనల్​ కలెక్టర్​ చందర్, ఆర్డీవో వీణ ఫిర్యాదులు స్వీకరించారు.  వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుత ఫిర్యాదులతోపాటు పెండింగ్​ దరఖాస్తులను పరిశీలించాలని కలెక్టర్​ అధికారులను ఆదేశించారు. ఎస్సెస్సీలో అత్యధిక 
మార్కులు సాధించిన విద్యార్థులను  కలెక్టర్ సన్మానించారు.