ఘట్కేసర్, వెలుగు: ఆర్టీవో చలాన్ పేరుతో సైబర్ చీటర్లు ఓ కొరియర్ బాయ్ను చీటింగ్ చేశారు. పోచారం డివిజన్ అన్నోజిగూడకు చెందిన రవీందర్(40) కొరియర్ బాయ్ గా పనిచేస్తుంటాడు. ఈ నెల 2న తన ఫోన్కు ఆర్టీవో చలాన్ పేరుతో వచ్చిన లింక్ను క్లిక్ చేశాడు. దీంతో అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.75 వేలు డెబిట్ అయ్యాయి.
ఇదే డివిజన్ లో మరో వ్యక్తి మోసపోయాడు. కొర్రెములకు చెందిన తోట ఉపేందర్(53) కాంట్రాక్టు పనిచేస్తుంటాడు. ఈ నెల 5న ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం రూ.లక్ష 50 వేలు ఇచ్చాడు. రెండు రోజులకే ఆయన ఖాతా నుంచి మూడు దఫాలుగా రూ.లక్ష 26 వేలు మాయమయ్యాయి. బాధితులు పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

