మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. డిసెంబర్ 8న రాత్రి కారు బైక్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కారు నుజ్జనుజ్జ కాగా పూర్తిగా ధ్వంసం అయ్య
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతులు, కృష్ణ జ్యోత్స్నగా గుర్తించారు. కుషాయిగూడ నుంచి బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు కీసర పోలీసులు.
