ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని సరోజినీ నాయుడు పిల్లల ఆసుపత్రిలో వైద్యులు ఏడు నెలల శిశువు కడుపు నుండి 2 కేజీల బరువున్న కణితిని తొలగించారు. ఈ ప్రక్రియ కోసం నాలుగు గంటల పాటు శస్త్రచికిత్స కొనసాగింది. శిశువు ఫీటస్ ఇన్ ఫీటూ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది.
ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉందని శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యుల బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ డి.కుమార్ తెలిపారు. ప్రతాప్గఢ్ జిల్లా కుంట ప్రాంతానికి చెందిన చిన్నారి తరచూ కడుపు నొప్పితో బాధపడుతున్నాడు.
సీటీ స్కాన్ చేసిన వైద్యులు కణితి ఉన్నట్లు గుర్తించి ఆపరేషన్ చేశారు. అయితే బిడ్డకు జన్మనిచ్చినప్పుడే తల్లి మరణించినట్లు వైద్యులు తెలిపారు.