బీఆర్ఎస్కు 20 మంది కౌన్సిలర్లు రాజీనామా

బీఆర్ఎస్కు 20 మంది కౌన్సిలర్లు రాజీనామా

మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన 20 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ రాజీనామా చేశారు. వారం రోజుల క్రితం బీఆర్ఎస్ కౌన్సిలర్లు క్యాంపుకు తరలి వెళ్లారు. అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వారంతా రాజీనామా నిర్ణయానికి వచ్చారు. పార్టీకి,  ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి కౌన్సిలర్లు లెటర్ రాశారు. 

ఆ తర్వాత చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన చైర్మన్ శ్వేతకు దుర్గం చిన్నయ్య మద్దతు ఇస్తూ.. పార్టీలో ఉన్న తమను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు. రేపు(జనవరి 12) బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాసం జరగనుంది. ఈ నేపథ్యంలో కౌన్సిలర్లు ఒక్కసారిగా పార్టీకి రాజీనామాలు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.