బోధన్ ​పట్టణాభివృద్ధికి రూ.20 కోట్లు

బోధన్ ​పట్టణాభివృద్ధికి రూ.20 కోట్లు

బోధన్, వెలుగు : మంత్రి కేటీఆర్, ​ఎమ్మెల్యే షకీల్​సహకారంతో బోధన్​పట్టణాభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరైట్లు బీఆర్ఎస్​ మున్సిపల్​ ఫ్లోర్​ లీడర్ ​బెంజర్ ​గంగారం, టౌన్ ​ప్రెసిడెంట్​ రవీంద్రయాదవ్ ​తెలిపారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్​లో వీరు మాట్లాడారు.

నెలరోజుల క్రితం మున్సిపాలిటీకి రూ.15.21 కోట్లు మంజూరయ్యాయని,  మళ్లీ ఇప్పుడు రూ.20 కోట్లు కేటాయించారన్నారు. నెల రోజుల్లో టెండర్లు పూర్తి చేసి, పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కౌన్సిలర్లు దూప్​సింగ్, అబ్దుల్లా, జావీద్, బీఆర్ఎస్​ లీడర్లు పాల్గొన్నారు.