రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హసన్ నగర్ లో భారీ కొండచిలువ కలకలం రేపింది. లారీ పార్కింగ్ వద్ద సౌండ్ రావడంతో లారీ డ్రైవర్లు చుట్టుపక్కల వెతికారు. భారీ కొండచిలువను చూసి ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు లారీ డ్రైవర్లు. కొండచిలువు 20 ఫీట్ల పొడవు ఉండటం.. వన్యప్రాణులు అడవులను వదలి జనవాసాల మధ్యకు చేరుకుంటుండంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
స్థానికులు వెంటనే పోలీసులకు, ఆటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అధికారులు వచ్చే లోపే స్థానికులు కొండచిలువను పట్టుకున్నారు. వచ్చాక అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ భారీ కొండచిలువను చూసిన పోలీసులు,అధికారులు సైతం కంగుతిన్నారు. అధికారులు కొండ చిలువను జూ పార్క్ కు తరలించారు. అయితే భారీ వర్షాలకు కొండ చిలువ జనావాసాల మధ్యకు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు