తెలంగాణలో 20 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

తెలంగాణలో 20 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికలకు ముందు 20 మంది IPS అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు శనివారం (జనవరి 17)  సాయంత్రం ఉత్తర్వులు జారీ శారు. 

  • డా. గజరావు భూపాల్ (IPS 2008) సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నుంచి బదిలీ అయ్యి ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ – ప్రొవిజనింగ్ & లాజిస్టిక్స్‌గా నియామితులయ్యారు. ఆయనకు  అదనంగా IG – స్పోర్ట్స్ & వెల్ఫేర్ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు.  
  • అభిషేక్ మొహంతీ (IPS 2011) నార్కోటిక్స్ బ్యూరో DIG నుంచి విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ DIG గా బదిలీ అయ్యారు.
  • ఆర్. భాస్కరన్ (IPS 2012) CI సెల్ SP నుంచి  DIG, CI సెల్ – ఇంటెలిజెన్స్కు ట్రాన్స్ఫర్ అయ్యారు.
  •  జి. చందనా దీప్తి (IPS 2012) రైల్వేస్ SP/DIG నుంచి ఫ్యూచర్ సిటీ అడిషనల్ కమిషనర్ (అడ్మిన్ & ట్రాఫిక్)గా బదిలీ అయ్యారు.
  • టి. అన్నపూర్ణ (IPS 2013) విజిలెన్స్ SP నుంచి సైబరాబాద్ DCP (అడ్మిన్)
  •  బి.కే. రాహుల్ హెగ్డే (IPS 2014) హైదరాబాద్ ట్రాఫిక్ DCP నుంచి  ట్రాఫిక్–III DCP
  • కె. అపూర్వా రావు (IPS 2014) ఈస్ట్ జోన్ DCP నుంచి  ఇంటెలిజెన్స్ SP
  • బాల స్వామి (IPS 2018) ఈస్ట్ జోన్ DCP నుంచి విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ SP
  • ఆర్. వెంకటేశ్వర్లు (IPS 2018) ట్రాఫిక్–III DCP నుంచి CID SP
  • ఎస్. చైతన్య కుమార్ (IPS 2020) సౌత్ ఈస్ట్ జోన్ DCP నుంచి క్రైమ్స్ DCP, హైదరాబాద్
  • అవినాష్ కుమార్ (IPS 2021) అడిషనల్ SP (ఆపరేషన్స్), కొత్తగూడెం నుంచి ట్రాఫిక్–I DCP, హైదరాబాద్
  • కాజల్ (IPS 2021) ఉట్నూర్ ASP నుంచి ట్రాఫిక్–II DCP, హైదరాబాద్
  •  శేషాద్రిని రెడ్డి (IPS 2021) జగిత్యాల అడిషనల్ SP నుంచి ట్రాఫిక్–II DCP, సైబరాబాద్
  • కంకనాల రాహుల్ రెడ్డి (IPS 2021) భువనగిరి ASP నుంచి ట్రాఫిక్–I DCP, మల్కాజ్‌గిరి
  • శివమ్ ఉపాధ్యాయ (IPS 2021) ములుగు అడిషనల్ SP నుంచి  ట్రాఫిక్ DCP, ఫ్యూచర్ సిటీ

అదే విధంగా శ్రీనివాసులు, రంజన్ రాథన్ కుమార్, శ్యామ్ సుందర్, పి. అశోక్, ఎ. బాలకోటిలను కీలక స్థానాలకు బదిలీ చేసింది ప్రభుత్వం.