సంక్రాంతి పండుగకు ఏపీకి 20 ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగకు ఏపీకి 20 ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్​, వెలుగు: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏపీకి 20  ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.  కాచిగూడ – -కాకినాడ టౌన్​-రూట్​లో 10 రైళ్లు, హైదరాబాద్– ​-తిరుపతి – -హైదరాబాద్ ​రూట్​లో మరో 10 రైళ్లను నడపనుంది. ఈ రైళ్లు ఈ నెల 28 ,29, జనవరి 4,5,11,12,18,19 తేదీల్లో అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. 

సికింద్రాబాద్​, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో హాల్టింగ్​ ఉంటుందని, రైళ్లలో ఏసీ1,ఏసీ2 టైర్, ఏసీ 3 టైర్​, స్లీపర్ ​క్లాసులతో పాటు జనరల్​సెకండ్​ క్లాస్​ కోచ్​లు ఉంటాయని తెలిపారు. పండుగకు సొంతూరు వెళ్లే ప్రయాణికులు ప్రత్యేక రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.