లారీ క్యాబిన్‌లో 200 కేజీల గంజాయి

లారీ క్యాబిన్‌లో 200 కేజీల గంజాయి

లారీ క్యాబిన్‌లో గంజాయి తరలిస్తున్న అంతర రాష్ట్ర స్మగ్లర్ల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం నుంచి ఉత్తర ప్రదేశ్‌కు లారీ సీక్రెట్ క్యాబిన్‌లో గంజాయి తరలిస్తున్న దేవేందర్ సింగ్, రవీంద్ర కుమార్‌లను హయత్‌నగర్ వద్ద అరెస్ట్ చేసినట్లు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. వారి వద్ద నుంచి 200 కేజీల గంజాయి, ఒక లారీ, 15000 నగదు,3 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో మరో ఇద్దరు యాదవ్, హరి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ‘నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 40 లక్షలు ఉంటుంది. విశాఖ అరకులో 3000 వేలకు కేజీ గంజాయి కొనుగోలు చేసి ఉత్తర్ ప్రదేశ్‌కు తరలిస్తున్నారు. గతంలో కూడా ఇలా సీక్రెట్ క్యాబిన్‌లో గంజాయి తరలిస్తున్న వారిని అరెస్టు చేశాం. అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తాం’ అని కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.