మెర్సిడెస్‌‌‌‌‌‌‌‌ బెంజ్ కొత్త కార్ల ధరలు రూ.3 కోట్ల పైనే..

మెర్సిడెస్‌‌‌‌‌‌‌‌ బెంజ్ కొత్త కార్ల ధరలు రూ.3 కోట్ల పైనే..

మెర్సిడెస్-బెంజ్ ఇండియా భారతదేశంలో రెండు కొత్త లగ్జరీ స్పోర్ట్స్ కార్లను లాంచ్ చేసింది.  ఏఎంజీ జీటీ 63 4మాటిక్+, జీటీ 63 ప్రో 4మాటిక్‌‌‌‌‌‌‌‌+ కార్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో రేసింగ్ టెక్నాలజీ, హ్యాండ్-బిల్ట్ ఇంజన్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. జీటీ 63 4మాటిక్+ - వంద కిమీ స్పీడును  కేవలం 3.2 సెకన్లలో చేరుకుంటుంది. టాప్‌‌‌‌‌‌‌‌ స్పీడ్‌‌‌‌‌‌‌‌ 315 కిమీ. దీని ధర రూ.3 కోట్లు (ఎక్స్‌‌‌‌‌‌‌‌షోరూమ్). జీటీ  63 ప్రో 4మాటిక్ + -వంద కిమీ స్పీడ్‌‌‌‌‌‌‌‌ను   3.1 సెకన్లలో చేరుకుంటుంది. టాప్ స్పీడ్ 317 కిమీ. ఈ కారు ధర రూ. 3.65 కోట్లు (ఎక్స్‌‌‌‌‌‌‌‌షోరూమ్‌‌‌‌‌‌‌‌).