తెలంగాణలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ మరో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. కూకట్ పల్లి ఫేజ్ 2లో ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ మహిళను గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. బాధిత మహిళ సోదరుడు కొన్ని రోజుల క్రితం లండన్ వెళ్లి వచ్చినట్లు తెలుస్తుంది. కరోనాపై మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. నిన్న(20న )ఒక్కరోజే 1500 మంది విదేశాల నుంచి వచ్చారన్నారు. మార్చి 1 నుంచి ఇప్పటి వరకు 20 వేల మంది విదేశాల నుంచి వచ్చారన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు వారంతటే వాళ్లే వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. దగ్గు,జల్బు ఏదైనా సమస్య ఉన్నా స్వయంగా హాస్పిటల్ కు వస్తే వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. పొరుగు రాష్ట్రాలనుంచి బస్సులు తెలంగాణకు రాకపోకలు బంద్ చేస్తున్నామన్నారు.
see more news