
- ప్రశ్నార్థకంగా సివిల్ సర్వీస్ అకాడమీ సెంటర్ ఏర్పాటు
- హడావుడిగా ‘ఈక్వల్ ఆపర్చునిటీ’ కోచింగ్ సెల్మూసివేత
- ఉచిత కోచింగ్ కోసం నిరుద్యోగులు, స్టూడెంట్లఎదురుచూపు
సికింద్రాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి 21 పాయింట్ఫార్ములా విజన్ను రూపొందించగా కాగితాలకే పరిమితమైంది. ప్రతిపాదిత ప్రణాళికల్లో ఏ ఒక్కటి నెరవేరట్లేదు. ఈ కేంద్రాన్ని రూ.50 లక్షల బడ్జెట్ తో ప్రారంభిస్తామని చెప్పిన ఆఫీసర్లు ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. దీంతో సివిల్సర్వీసెస్అకాడమీ అమలుకు నోచుకోవడం లేదు. అకాడమీని త్వరలోనే ప్రారంభిస్తామని, ప్రతి ఏటా రూ.50 లక్షల బడ్జెట్కేటాయిస్తామని ఓయూ వీసీగా బాధ్యతలు చేపట్టినపుడు మీడియాకు చెప్పారు. జువాలజీ డిపార్ట్మెంట్సమీపంలోని పాత వర్క్షాప్ షెడ్డుకు రిపేర్లు కూడా చేయించారు. గత జనవరి 1 నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించిన ఆఫీసర్లు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. అంతేకాకుండా అప్పటి వరకు కొనసాగిన ఈక్వల్ఆపర్చునిటీ కోచింగ్సెల్ను కూడా మూసివేశారు. ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి కావాల్సిన సౌకర్యాలు, ఫ్యాకల్టీ, బడ్జెట్ పై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో పోటీ పరీక్షలకు రెడీ అవుతున్న స్టూడెంట్స్నిరాశతో ఎదురుచూడక తప్పని పరిస్థితి ఉంది. కేంద్రంలో సివిల్స్ తో పాటురాష్ట్రస్థాయి పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వాలంటే ఏడాదికి కనీసం కోటి రూపాయల బడ్జెట్కేటాయిస్తేనే నిర్వహణ సాధ్యమని పలువురు అధ్యాపకులు పేర్కొంటున్నారు.
క్వాలిఫయింగ్ జాబితాలోను దక్కని చోటు
ఒకప్పుడు సివిల్సర్వీసెస్పరీక్షల్లో టాప్ర్యాంకులో నిలిచిన ఓయూ, ఇప్పుడు కనీసం క్వాలిఫయింగ్జాబితాలో కూడా చోటు పొందలేదు. దీనిని అధిగమించాలని ఓయూ వీసీ 21 పాయింట్స్ఫార్ములాతో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా సివిల్సర్వీసెస్అకాడమీ ఏర్పాటుకు నిర్ణయించారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలపై, ముఖ్యంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్పై ట్రైనింగ్ ఇచ్చి వారిని జాతీయస్థాయిలో పోటీల్లో నిలిచేలా తయారు చేయాలనే లక్ష్యంతో కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది నుంచే సివిల్స్ప్రిలిమినరీ పరీక్షలకు పోటీ పడే వారికి శిక్షణ ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ కేంద్రంలో ఓయూ క్యాంపస్స్టూడెంట్స్తో పాటు సికింద్రాబాద్, సైఫాబాద్పీజీ కాలేజీలు, కోఠి మహిళా కాలేజీ, నిజాం కాలేజీ, హైదరాబాద్ కాలేజీల్లో సీట్లు పొందిన గ్రామీణ ప్రాంతాలకు చెందిన 750 మంది స్టూడెంట్స్కు శిక్షణ ఇస్తామని ప్రకటించారు.
సెంటర్నిర్వహణకు రూ.5 లక్షల నిధులే..
హడావుడిగా సివిల్ సర్వీసెస్ అకాడమి ప్రారంభిస్తామని ప్రకటించిన వీసీ నిధులను వర్సిటీ బడ్జెట్ నుంచి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టేందుకు ఉన్నత విద్యామండలికి ప్రతిపాదనలు పంపగా, రూ.5లక్షలు విడుదల చేసేందుకు అంగీకరించింది. ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించడంతో సివిల్స్, గ్రూప్–-1, గ్రూప్–-2 వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ఇచ్చే ఫ్యాకల్టీ చాలా రెమ్యునరేషన్డిమాండ్ చేస్తున్నారని, దీంతో ఈ డబ్బులు ఏ మాత్రం సరిపోవని చెబుతున్నారు. ఒక వేళ ప్రారంభిస్తే సరైన ఫ్యాకల్టీ దొరకక ఫెయిల్యూర్అయ్యే ప్రమాదముందని భావిస్తున్నట్లు సమాచారం.
వెంటనే కోచింగ్ సెంటర్ ప్రారంభించాలె
ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగులు, స్టూడెంట్స్రెడీ అవుతున్నారు. పోటీని తట్టుకొని జాబ్ కొట్టాలంటే కోచింగ్తప్పనిసరి. ఆఫీసర్లు కోచింగ్అకాడమీ ప్రారంభిస్తామని ప్రకటించి 9 నెలలు గడుస్తోంది. 3 నెలల క్రితం ప్రారంభించాల్సిన అకాడమీ అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వెంటనే అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో అన్ని పోటీ పరీక్షలకు నిరంతరం కోచింగ్ ఇవ్వాలి. పెరుగుతున్న స్టూడెంట్స్సంఖ్యకు అనుగుణంగా రీడింగ్ హాల్స్ పెంచాలి.
- కాంపెల్లి శ్రీనివాస్, ఏఐఎస్ఎఫ్ నేత
నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాం
ఓయూలో కోచింగ్అకాడమీ నిర్వహణకు రూ. కోటి అవసరం ఉంటుంది. ఈ నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. కోచింగ్నిర్వహణకు అవసరమైన హాలు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కోచింగ్క్లాసులతో పాటు రీడింగ్ రూములు, లైబ్రరీ వంటి అరేంజ్మెంట్స్చేస్తున్నాం. నిధులు విడుదలైన వెంటనే ట్రైనింగ్స్టార్ట్చేస్తాం
- ప్రొఫెసర్గణేశ్, సివిల్సర్వీసెస్అకాడమీ డైరెక్టర్