
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: రెవెన్యూ సదస్సుల్లో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 21 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం క్యాంపు ఆఫీసు నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూసమస్యలకు సంబంధించి ఏమైనా కోర్టు ఆర్డర్లు ఉంటే పట్టాదార్ పాసు పుస్తకాలు ఇవ్వద్దన్నారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించి బోర్డులు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జులై 10 కల్లా దరఖాస్తులు పరిష్కారం కావాలన్నారు. డీఆర్ఓ సంగీత, కలెక్టరేట్ సూపరిటెండెంట్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.