భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కేంద్రంలో మంగళవారం 22 మంది మావోయిస్టులు ఎస్పీ కిరణ్ చౌహాన్ ఎదుట సరెండర్ అయ్యారు. వీరంతా మిలీషియా కమాండర్ గోంచే హుంగా ఆధ్వర్యంలో పని చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. లొంగిపోయిన వారిలో మండకం బండి, మడవి హుండా, మడకం నందా, మడకం రామా, మడకం సోమ్డా, మిడియం ఐతా, మడకం చైతు, మాడవి హుంగా, లక్ష్మీ ముచాకే, గోంచే హుండా, మడవి దూలా, కుంజా కోసా, వేకోవిజ్జా, వేకో హడ్మా, ముచికే సుక్కా, మడవి జోగా, మడకం పాండు, నుప్పా దేవా, బోగాం దస్రు, సలవం లక్మా, జగత్ భీమాలు ఉన్నారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీఆర్పీఎఫ్ క్యాంపులు, నిత్యం జరుపుతున్న కూంబింగ్తో పాటు ప్రధాన లీడర్ల సరెండర్లతో గ్రామస్థాయిలో పని చేసే సానుభూతిపరులు, మిలీషియా సభ్యులు లొంగిపోతున్నట్లు ఎస్పీ వెల్లడించారు. జనజీవన స్రవంతిలోకి వస్తున్న వారికి ప్రభుత్వం తరపున పునరావాసం కల్పిస్తామని తెలిపారు.
