ఫ్లైట్ లో పురిటినొప్పులు .. ఎమర్జెన్సీ ల్యాండ్

ఫ్లైట్ లో పురిటినొప్పులు .. ఎమర్జెన్సీ ల్యాండ్

దోహ నుండి బ్యాంకాక్ కు వెళుతున్న ఖతార్ ఎయిర్‌వేస్ ఫ్లైట్లో  ఓ గర్భిణికి సడెన్ గా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఇవాళ(మంగళవారం)  తెల్లవారుజామున 3.15 గంటలకు కోల్‌కతా ఎయిర్ పోర్టులో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. థాయ్ లాండ్ కు చెందిన 23 ఏళ్ల గర్భిణి  ఫ్లైట్ లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. తర్వాత తల్లీబిడ్డల్ని కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.