
- విద్యుత్ ఆఫీసుకు సిద్దిపేట మున్సిపల్ శాఖ నోటీసులు
- నరికిన వాటి స్థానంలో 400 మొక్కలు నాటాలని ఆదేశాలు
సిద్దిపేట టౌన్, వెలుగు : ముందస్తు అను మతి లేకుండా కరెంట్ తీగలకు అడ్డుగా ఉన్నాయని చెట్లు నరికినందుకు విద్యుత్శాఖకు..సిద్దిపేట మున్సిపల్అధికారులు రూ.24 లక్షల జరిమానా విధించారు. సిద్దిపేట విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్లు, సిబ్బంది ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో కరెంట్ వైర్లకు అడ్డం వస్తున్నాయని సుమారు 400 చెట్లకు పైగా నరికివేశారు.
ఇందులో హరితహారంలో భాగంగా నాటిన చెట్లు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని ఈ నెల 23న గుర్తించిన సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి.. విద్యుత్శాఖ అసిస్టెంట్ ఇంజినీర్లకు రూ.24 లక్షల జరిమాన విధిస్తున్నట్టు నోటీసు పంపారు. నరికివేసిన చెట్ల స్థానంలో 400 కొత్త మొక్కలను నాటాలని అందులో పేర్కొన్నారు.