
హైదరాబాద్ సిటీ, వెలుగు: కూకట్పల్లిలోని జేఎన్టీయూ స్టూడెంట్లు సత్తా చాటారు. సోమవారం నిర్వహించిన క్యాంపస్ప్లేస్మెంట్స్లో ప్రతిభ కనబరిచి హయ్యస్ట్ప్యాకేజీ జాబ్స్సాధించారు. మోటూరి అమూల్య, చల్లా సాయి మహితారెడ్డి అనే ఇద్దరు స్టూడెంట్లు రూ.24 లక్షలు, కుసుమిత రూ.19.75లక్షల యాన్యువల్ప్యాకేజీ జాబ్స్పొందారు. వీరితోపాటు మరో 9 మంది స్టూడెంట్లకు కంపెనీలు రూ.19 లక్షల ప్యాకేజీని ఆఫర్చేశాయి.
ప్రస్తుతం కొనసాగుతున్న ప్లేస్మెంట్స్లో ఇప్పటివరకు మొత్తం 130 మంది స్టూడెంట్లు ప్రముఖ సాఫ్ట్ వేర్కంపెనీల్లో జాబ్స్సాధించారని ప్లేస్మెంట్స్ ఆఫీసర్ విష్ణువర్ధన్ తెలిపారు. ఎంపికైన స్టూడెంట్లను రిజిస్ట్రార్ కె.వెంకటేశ్వర రావు, లెక్చరర్లు అభినందనలు తెలిపారు.