జేఎన్టీయూ స్టూడెంట్లకు 24 లక్షల ప్యాకేజీ జాబ్స్

జేఎన్టీయూ స్టూడెంట్లకు 24 లక్షల ప్యాకేజీ జాబ్స్

హైదరాబాద్ సిటీ, వెలుగు: కూకట్​పల్లిలోని జేఎన్​టీయూ స్టూడెంట్లు సత్తా చాటారు. సోమవారం నిర్వహించిన క్యాంపస్​ప్లేస్​మెంట్స్​లో ప్రతిభ కనబరిచి హయ్యస్ట్​ప్యాకేజీ జాబ్స్​సాధించారు. మోటూరి అమూల్య, చల్లా సాయి మహితారెడ్డి అనే ఇద్దరు స్టూడెంట్లు రూ.24 లక్షలు, కుసుమిత రూ.19.75లక్షల యాన్యువల్​ప్యాకేజీ జాబ్స్​పొందారు. వీరితోపాటు మరో 9 మంది స్టూడెంట్లకు కంపెనీలు రూ.19 లక్షల ప్యాకేజీని ఆఫర్​చేశాయి.

 ప్రస్తుతం కొనసాగుతున్న ప్లేస్​మెంట్స్​లో ఇప్పటివరకు మొత్తం 130 మంది స్టూడెంట్లు ప్రముఖ సాఫ్ట్ వేర్​కంపెనీల్లో జాబ్స్​సాధించారని ప్లేస్​మెంట్స్ ఆఫీసర్ విష్ణువర్ధన్ తెలిపారు. ఎంపికైన స్టూడెంట్లను రిజిస్ట్రార్ కె.వెంకటేశ్వర రావు, లెక్చరర్లు అభినందనలు తెలిపారు.