మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ సెంటర్​కు 25 ఏండ్లు

మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ సెంటర్​కు 25 ఏండ్లు

హైదరాబాద్​లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ సెంటర్ (ఐడీసీ) 25 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సంస్థ ఆఫీసులో మంగళవారం భారీ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి చీఫ్​ గెస్ట్​గా మాజీ క్రికెటర్ ​ కపిల్​ దేవ్​ వచ్చారు. ఈ సెంటర్ ​ కోపైలెట్స్,  వివిధ ఏఐ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌లు వంటి  ఉత్పత్తులను రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది.  

అంతేగాక అజూర్, విండోస్, ఆఫీస్,  బింగ్‌‌‌‌‌‌‌‌తో సహా కీలకమైన మైక్రోసాఫ్ట్ ఆఫర్ల డెవెలప్​మెంట్​కు ఐడీసీ ఎంతో దోహదపడింది. ఇప్పటికే ఉన్న ఉత్పత్తులను మెరుగుపరచడానికి, కొత్త వాటిని డెవెలప్​చేయడానికి ఏఐ, ఎల్​ఎల్​ఎంలను ఉపయోగిస్తామని ఐడీసీ తెలిపింది. ఆండ్రాయిడ్​, ఐఓఎస్​  డివైజ్​ల కోసం మైక్రోసాఫ్ట్​ 365 (మొబైల్​) అప్లికేషన్లను తయారు చేయడంలో ఎంతో సహకారం అందించింది.  మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ అయిన అజూర్ కోసం మౌలిక సదుపాయాలను నిర్మించడంలో ఐడీసీ  ముందున్నది.