2027 నాటికి 250 ఈవీ చార్జింగ్ స్టేషన్లు.. మహీంద్రా ప్రకటన

2027 నాటికి 250 ఈవీ చార్జింగ్ స్టేషన్లు.. మహీంద్రా ప్రకటన

న్యూఢిల్లీ: ఆటో కంపెనీ మహీంద్రా అండ్​ మహీంద్రా 2027 చివరి నాటికి 180 కిలోవాట్ల సామర్థ్యం గల 250 ఎలక్ట్రిక్ వెహికల్​(ఈవీ) చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు మంగళవారం (నవంబర్ 25) తెలిపింది. 

ఈ నెట్‌‌వర్క్‌‌లో 250 స్టేషన్లలో 1,000 చార్జింగ్ పాయింట్లు ఉంటాయి.  బెంగళూరు – చెన్నై హైవేపై హోస్కోట్ వద్ద, ఢిల్లీ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్​హెచ్–44 పై మూర్తల్ వద్ద రెండు చార్జింగ్​స్టేషన్లను కంపెనీ ఇప్పటికే ప్రారంభించిందని కంపెనీ సీఈఓ (ఆటోమోటివ్ డివిజన్) నళినీకాంత్ గొల్లగుంట అన్నారు. వీటిలో రెస్టారెంట్లు, కేఫ్‌‌ల వంటి సౌకర్యాలూ ఉంటాయని ఆయన వివరించారు.