జూన్ 29న రాజన్న కోడెల పంపిణీ .. అర్హులైన రైతులు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్లై చేసుకోవాలి

జూన్ 29న రాజన్న కోడెల పంపిణీ .. అర్హులైన రైతులు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్లై చేసుకోవాలి

వేములవాడ, వెలుగు: వేములవాడ తిప్పాపూర్ లోని గోశాలలో 250 కోడెలను ఈ నెల 29న పంపిణీ చేయనున్నట్లు రాజరాజేశ్వర స్వామి ఆలయ ఇన్​చార్జి ఈవో రాధాబాయి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. అర్హులైన ఉమ్మడి కరీంనగర్  జిల్లా రైతులు వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

 పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డ్ తో https://rajannasircilla.telangana.gov.in/ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అర్హులైన రైతులకు మాత్రమే జియో ట్యాగింగ్  కలిగి ఉన్న కోడెలను పంపిణీ చేస్తామని తెలిపారు.