
వేములవాడ, వెలుగు: వేములవాడ తిప్పాపూర్ లోని గోశాలలో 250 కోడెలను ఈ నెల 29న పంపిణీ చేయనున్నట్లు రాజరాజేశ్వర స్వామి ఆలయ ఇన్చార్జి ఈవో రాధాబాయి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. అర్హులైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డ్ తో https://rajannasircilla.telangana.gov.in/ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అర్హులైన రైతులకు మాత్రమే జియో ట్యాగింగ్ కలిగి ఉన్న కోడెలను పంపిణీ చేస్తామని తెలిపారు.