
మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటైన కేబినెట్లో 27 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారిలో 18 మంది సీరియస్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఎలక్షన్స్ టైంలో ఎన్నికల కమిషన్కు ఇచ్చిన సమాచారం ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. సీఎం ఉద్ధవ్ థాక్రే ఎన్నికల్లో పోటీ చేయనందున ఆయన వివరాలు తెలియలేదు. ఆడ్వకసీ గ్రూప్ అసోసి యేష్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) ఈ మేరకు రిపోర్ట్ రిలీజ్ చేసింది. శివసేన , ఎన్సీపీ ,కాంగ్రెస్ ప్రభుత్వంలో ని 42 మంది మినిస్టర్లలో 41మంది కోటీశ్వరులని రిపోర్ట్ తెలిపింది. వారి యావరేజ్ ఆస్తులు రూ.22 కోట్లు. కాంగ్రెస్కు చెందిన విశ్వజిత్ కాదమ్ రూ.217 కోట్ల ఆస్తితో మొదటి ప్లేస్లో ఉన్నారు.