ఢిల్లీలో కరోనాతో 273 మంది మృతి

ఢిల్లీలో కరోనాతో 273 మంది మృతి
  • ఇవాళ 13వేల కొత్త కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సునామీలా విరుచుకుపడుతోంది. గడిచిన 24 గంటల్లో 13వేల 336 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 273 మంది మృతి చెందారు. అలాగే 14 వేల 738 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రుల నుంచి  డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య  13 లక్షల 23,567 కి చేరింది. అలాగే కోలుకున్న వారి సంఖ్య 12 లక్షల 17వేల 991. అలాగే యాక్టీవ్ కేసులు 86 వేల 232 కాగా ఇప్పటి వరకు కరోనా తో మృతి చెందిన వారి సంఖ్య  19 వేల344గా నమోదు అయింది.