
తమిళనాడులోని కరూర్లో భారీ తొక్కిసలాట జరిగింది. శనివారం ( సెప్టెంబర్27) సాయంత్రం కరూర్ లో టీవీకే చీఫ్ విజయ్ కార్నర్ మీటింగ్లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్యం 29కి చేరింది. మృతుల్లో ఆరుగురు చిన్నారులు,16 మంది మహిళలున్నారు. 50 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని కరూర్ లోని ఆస్పత్రులకు తరలించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
నామక్కల్ లో ప్రచారాన్ని ముగించుకొని కర్నూర్ లో శనివారం రాత్రి 7గంటల తర్వాత కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. విజయ్ మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా తోపులాట జరిగి తొక్కిసలాటకు దారి తీసింది. తొక్కిసలాటలో చిక్కుకుని చాలా మంది స్పృహ కోల్పోయారు. వారిని కరూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా 29 మంది మృతి చెందారని ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ తెలిపారు.
🚨 TRAGIC NEWS 💔
— Megh Updates 🚨™ (@MeghUpdates) September 27, 2025
Tamil Nadu: STAMPEDE at TVK Chief Vijay’s rally KILLS 29 people, including three children.
Prayers for the victims & their families 🙏 pic.twitter.com/C1T2wrOGvM
తొక్కిసలాటపై ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రేపు( ఆదివారం) బాధితులను పరామర్శించనున్నారు సీఎం స్టాలిన్.
విజయ్ కరూర్ ర్యాలీకి అనుమతి లేఖలో 10,000 మంది హాజరవుతారని అంచనా వేశారు. అయితే 1.20 లక్షల చదరపు అడుగుల వేదిక దగ్గర దాదాపు 50వేల మందికి పైగా హాజరయ్యారని తెలుస్తోంది.
మరోవైపు సీఎం స్టాలిన్ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. విషయం తెలిసిన వెంటనే బాధితులకు తక్షణమే చికిత్స అందించాలని కరూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్లను సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు. కరూర్లో పరిస్థితి గురించి కలెక్టర్ తంగవేలును సీఎం అడిగి తెలుసుకున్నారు.మంత్రులు సుబ్రమణియన్, మహేష్ తోపాటు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీలు కరూర్ ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. లా అండ్ అర్డర్ అడిషనల్ డీజీపీ డేవిడ్సన్ కూడా ఆస్పత్రికి వెళ్లారు.
శనివారం రాత్రి 9 గంటల నాటికి తొక్కిసలాటలో మృతిచెందిన వారి సంఖ్య 29 కి చేరిందని రిపోర్టుల ప్రకారం తెలుస్తోంది. ఇంకా చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
VIDEO | Karur: Former DMK leader V Senthil Balaji rushes to hospital to meet the rally victims.
— Press Trust of India (@PTI_News) September 27, 2025
At least 10 persons, including children, feared dead due to stampede-like situation in Vijay's heavily crowded rally in Karur, Tamil Nadu.
(Full video available on PTI Videos -… pic.twitter.com/hroApRKuMR