తెలంగాణ‌లో కొత్త‌గా 2,982 కేసులు..21 మంది మృతి

తెలంగాణ‌లో కొత్త‌గా 2,982 కేసులు..21 మంది మృతి

హైదరాబాద్‌ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,982 క‌రోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపింది రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ‌. అలాగే 3,837 మంది వైర‌స్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారని..ఇవాళ క‌రోనాతో 21 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ కేసులు 5,74,026కు చేర‌గా. 5,33,862 మంది కోలుకున్నారంది. యాక్టివ్‌ కేసులు 36,917 ఉన్నాయని.. మొత్తం 3247 మంది మృతి చెందారని తెలిపింది. ఇవాళ 1,00,677 శ్యాంపిళ్ల పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది.