షీ టీమ్స్ 2కే, 5కే రన్

షీ టీమ్స్ 2కే, 5కే రన్

ఖమ్మం: మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఖమ్మంలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో 2కే, 5కే రన్ నిర్వహించారు. పట్టణంలోని సర్దార్ పటేల్ స్టేడియం నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు ఈ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహిళల భద్రత, లింగ సమానత్వం గురించి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. మహిళలు ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలన్నారు. పురుషుల కంటే తాము దేనిలో తక్కువకాదనే విషయాన్ని మహిళలు గుర్తించుకోవాలన్నారు. గతంలో కంటే ప్రస్తుతం మహిళలపై అఘాయిత్యాలు, దాడులు తగ్గాయన్నారు. సీసీ కెమెరాల నిఘా పెంచడం వల్ల చాలా వరకు నేరాలు తగ్గాయని పేర్కొన్నారు. అనంతరం రన్ లో పాల్గొన్నవారికి మంత్రి ప్రశాంస పత్రాలు అందజేశారు. 

మరిన్ని వార్తల కోసం

ఆర్టీసీ చార్జీలు రూ. 5 నుంచి 14 వరకు పెరిగే చాన్స్

ఆగని పెట్రో ధరలు.. ఆరు రోజుల్లో 5 సార్లు పెంపు