
అహ్మదాబాద్ విమానం ప్రమాదంలో ఒక్కక్కొరిది ఒక్కో విషాద కథ. ఎవర్ని కదిలించిన కన్నీళ్లే వస్తున్నాయి.. జ్ణాపకాలు వెంటాడుతున్నాయి. విమానం బీజే మెడికల్ కాలేజీలోకి దూసుకుని వచ్చి మరీ పేలిపోయిన ఘటనలో.. మెడికోలు చనిపోయిన విషయం తెలిసింది. ఈ యాక్సిడెంట్ లో ముగ్గురు ప్రాణ స్నేహితులు చనిపోవటం కాలేజీలోనే అందర్నీ విషాదంలో నింపింది. అదే వారి చివరి భోజనం కావటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు కుటుంబ సభ్యులు, మిగతా స్నేహితులు.
ఆర్యన్ రాజ్ పుత్. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ దగ్గర్లోని జిగ్సోలి గ్రామం. నీట్ ఎగ్జామ్ లో 695 మార్కులు సాధించి.. బిజే మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాడు. మరో స్టూడెంట్ మానవ్ బాదూ. రాజస్థాన్ రాష్ట్రం హనుమాన్ గఢ్ కు చెందినవాడు. ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.. మరో స్టూడెంట్ జయప్రకాష్ చౌదరి. రాజస్థాన్ రాష్ట్రం బోరిచరణ్ గ్రామం. సెకండ్ ఇయర్ చదువుతున్నాడు..
ఈ ముగ్గురు ప్రాణ స్నేహితులు అయ్యారు. ఎక్కడెక్కడో పుట్టారు.. బీజేప మెడికల్ కాలేజీలో స్నేహితులు అయ్యారు.. ఆర్యన్ రాజ్ పుత్, మానవ్ ఒకే క్లాస్.. వీళ్లిద్దరికీ జయప్రకాష్ స్నేహితుడు అయ్యాడు. చౌదరి సెకండ్ ఇయర్ అయినా.. వీళ్లతో మంచి స్నేహం కుదిరింది. దీంతో బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయాల్లో కలిసే వెళతారు.. కలిసే భోజనం చేస్తారు.
విమాన ప్రమాదం జరిగిన రోజు కూడా మార్నింగ్ ఈ ముగ్గురు కలిసి టిఫిన్ చేశారు.. మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాల సమయంలో మధ్యాహ్నం భోజనం కోసం హాస్టల్ బిల్డింగ్ కు వచ్చారు.. ముగ్గురూ ఒకే చోట కూర్చుని.. కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్నారు. ఈ సమయంలో ఎయిర్ ఇండియా 171 విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ లోకి దూసుకొచ్చి పేలిపోయింది. ఈ ఘటనలో ఈ ముగ్గురు స్టూడెంట్స్ చనిపోయారు. కాలేజీ మొత్తాన్ని ఈ ఘటన కన్నీళ్లు తెప్పిస్తుంది.
ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. చావు కోసం ఈ కాలేజీ వచ్చారా అంటూ ఫ్రెండ్స్ కన్నీటిపర్యంతం అవుతున్నారు. ముగ్గురు స్నేహితులకు అదే చివరి భోజనం అయ్యింది.. చివరి మీటింగ్ అయ్యింది.. ఒకే క్లాస్.. ఒకే రూంమేట్స్.. చావు కూడా ఒకేసారి వచ్చింది.. ఇది మరింత విషాధంగా మారింది.