సూర్యపేటలో లారీ బీభత్సం.. అక్కడిక్కడే ముగ్గురు మృతి

సూర్యపేటలో లారీ బీభత్సం.. అక్కడిక్కడే ముగ్గురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  పాలకీడు మండలం జానపాడు రైల్వే ట్రాక్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన లారీ రోడ్డు ప్రక్కన ఆగిన రెండు బైకులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులలో ఇద్దరిది మిర్యాలగూడ మండలం జంకుతండా గుర్తించారు.