పట్టాలు తప్పిన సామలేశ్వరి ఎక్స్​ప్రెస్

పట్టాలు తప్పిన సామలేశ్వరి ఎక్స్​ప్రెస్

ముగ్గురు రైల్వే సిబ్బంది మృతి

భువనేశ్వర్: ఒడిశాలోని రాయగడ వద్ద హౌరా–జగదల్పూర్-–​సామలేశ్వరి ఎక్స్​ప్రెస్ మంగళవారం పట్టాలు తప్పింది. రైలు ఇంజన్​తో పాటు ఫ్రంట్​గార్డ్​బోగి, సెకండ్​ క్లాస్​బోగీలు పట్టాలు తప్పి, పక్క ట్రాక్​పై ఉన్న మెయింటనెన్స్​టవర్ కార్​ను ఢీకొట్టాయి. దీంతో ఇంజన్​లో మంటలు రేగాయి. రైలు ఢీకొట్టడంతో మెయింటనెన్స్​ టవర్ కార్​లోని ముగ్గురు రైల్వే సిబ్బంది చనిపోయారని ఈస్ట్​కోస్ట్​రైల్వే అధికార ప్రతినిధి జేపీ మిశ్రా చెప్పారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదన్నారు. ఈ ఘటనపై కమిషనర్​ఆఫ్​రైల్వే సేఫ్టీ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించినట్లు మిశ్రా వివరించారు.