
- చిన్నారి మనీశ్ కు పెద్ద జబ్బు
- ట్రాన్స్ ప్లాంటేషన్ కు రూ. 25 లక్షలు అవసరం
రాజన్న సిరిసిల్ల,వెలుగు: మూడేండ్ల బాబు జాండిస్ వ్యాధితో బాధపడుతుండగా సర్జరీ చేయాలంటే రూ.లక్షల్లో ఖర్చువుతాయి. దీంతో బాబు పేరెంట్స్ దాతల సాయం కోసం వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల టౌన్ లోని బీవై నగర్ కు చెందిన గూడూరి శేఖర్ కొడుకు మనీశ్కొద్ది రోజుల కింద జాండిస్ వ్యాధి బారిన పడ్డాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని అంకుర్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయగా చికిత్స పొందుతున్నాడు. జాండిస్ వ్యాధి కారణంగా లివర్ పూర్తిగా చెడిపోవడంతో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ అవసరమని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. ఇందుకు రూ. 25 లక్షల వరకు ఖర్చు అవుతాయని బాబు పేరెంట్స్ కు తెలిపారు.
ఇప్పటికే ట్రీట్ మెంట్ కు రూ. 4 లక్షల వరకు ఖర్చు చేయగా.. మరో రూ. 25 లక్షలు కావాల్సి ఉండడంతో కొడుకు ఆరోగ్య పరిస్థితిపై పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. పేద కుటుంబానికి చెందిన శేఖర్ తన కొడుకు వైద్య ఖర్చులను భరించే స్థితిలో లేరు. దీంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మానవతా దృక్పథంతో దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు స్పందించి మనీశ్ కు అండగా నిలవాలని పేరెంట్స్ కోరుతున్నారు. ప్రభుత్వం, అధికారులు కూడా స్పందించి తమ కొడుకును బతికించాలని వేడుకుంటున్నారు. ఆర్థికసాయం చేయాలనుకునేవారు బాబు తండ్రి జి. శేఖర్ ఫోన్ 9441161257 కు గూగుల్ పే, ఫోన్ పే చేయొచ్చని పేరెంట్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.