ఆగి ఉన్న ట్రక్కును ఓ కారు(SUV) ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాద సంఘటన రాజస్థాన్లోని సిరోహి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగింది. అహ్మదాబాద్ నుంచి జైసల్మేర్లోని రామ్దేవ్రాకు కారులో వెళుతుండగా భీమన గ్రామం సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మరో 9 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
ప్రమాదం గురించి తెలుసుకున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్విటర్ ద్వారా స్పందించారు. ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలుపుతూ.. ఐదుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించిడం విచారకరమని, గాయపడిన వ్యక్తులు త్వరగా కోలుకోవాలని ఆశిద్దామని ట్వీట్ చేశారు.