ఆగి ఉన్నట్రక్కున ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి

ఆగి ఉన్నట్రక్కున ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి

ఆగి ఉన్న ట్రక్కును ఓ కారు(SUV) ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాద సంఘటన రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగింది. అహ్మదాబాద్ నుంచి జైసల్మేర్‌లోని రామ్‌దేవ్రాకు కారులో వెళుతుండగా భీమన గ్రామం సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మరో 9 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

ప్రమాదం గురించి తెలుసుకున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్విటర్ ద్వారా స్పందించారు.  ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలుపుతూ.. ఐదుగురు వ్యక్తులు  ఈ ప్రమాదంలో మరణించిడం విచారకరమని,  గాయపడిన వ్యక్తులు త్వరగా కోలుకోవాలని ఆశిద్దామని ట్వీట్ చేశారు.

31332rajasthan:-5-people-killed,-9-injured-after-a-car-rammed-into-parked-truck-in-sirohi-district's-bhimana5