కొండచరియలు విరిగి పడి 36 మంది మృతి

కొండచరియలు విరిగి పడి 36 మంది మృతి

మహారాష్ట్రలో వరదలు విలయం సృష్టిస్తున్నాయి. ఊళ్లకు ఊళ్లు మునిగిపోతున్నాయి. రాయ్ గఢ్ జిల్లాలోని మూడు చోట్ల మట్టిపెళ్లలు విరిగిపడి ఇప్పటివరకు 36 మంది చనిపోయారు. మరో 30 మంది పలుచోట్ల ఇంకా శకలాల కింద చిక్కుకుని ఉన్నారు. వారిని రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి. అటు... మహారాష్ట్రలోని సితారా జిల్లాలో వరదల్లో చిక్కుకుని 8 మంది చనిపోయారు. 27 మందిని రక్షించామని.. ఇద్దరు కనిపించకుండా పోయారని సితారా జిల్లా కలెక్టర్ చెప్పారు. ఇంకా ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను కొనసాగుతున్నాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.