హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్)కు భారీగా అప్లికేషన్లు వస్తున్నాయి. బుధవారం నాటికి 3.73 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్1కు 2.13 లక్షల మంది, పేపర్2కు1.60 లక్షల మంది అప్లై చేశారు. మార్చి26 నుంచి ఈనెల12 వరకు దరఖాస్తుకు అవకాశముంది. మరో వారం రోజుల్లో ఇంకో రెండు లక్షల వరకు అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎంసెట్కు ఫస్ట్ డే 1582 అప్లికేషన్లు
టీఎస్ఎంసెట్ ఎగ్జామ్కు ఫస్ట్డే 1,582 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజినీరింగ్ స్ర్టీమ్కు 996 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ర్టీమ్ కు586 మంది అప్లై చేశారు.