డేవిస్‌‌‌‌ కప్‌‌‌‌ ప్లే ఆఫ్స్‌‌‌‌లో 4-0తో పాక్‌‌‌‌పై గెలుపు 

డేవిస్‌‌‌‌ కప్‌‌‌‌ ప్లే ఆఫ్స్‌‌‌‌లో 4-0తో పాక్‌‌‌‌పై గెలుపు 
  • డేవిస్‌‌‌‌ కప్‌‌‌‌ ప్లే ఆఫ్స్‌‌‌‌లో 4-0తో పాక్‌‌‌‌పై గెలుపు 
  • వరల్డ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌-1కు అర్హత

ఇస్లామాబాద్‌‌‌‌: దాదాపు 60 ఏండ్ల తర్వాత పాకిస్తాన్‌‌‌‌ గడ్డపై డేవిస్‌‌‌‌ కప్‌‌‌‌ ఆడిన ఇండియా టెన్నిస్‌‌‌‌ టీమ్‌‌‌‌ అదరగొట్టింది. దాయాది జట్టుతో తలపడిన ఎనిమిదోసారి కూడా విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఆదివారం ముగిసిన వరల్డ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌–1 ప్లే ఆఫ్స్‌‌‌‌లో టీమిండియా 4–0తో పాక్‌‌‌‌పై గెలిచి వరల్డ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌–1కు ప్రమోషన్ సాధించింది. తొలి రోజు రెండు సింగిల్స్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లు గెలిచి 2–0 లీడ్‌‌‌‌లో నిలిచిన ఇండియా రెండో రోజు డబుల్స్‌‌‌‌తో పాటు ఓ రివర్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో నెగ్గింది.

డబుల్స్‌‌‌‌లో తెలుగు కుర్రాడు సాకేత్‌‌‌‌ మైనేని–యూకీ భాంబ్రీ జోడీ 6–2, 7–6 (7/5)తో అఖీల్‌‌‌‌ ఖాన్‌‌‌‌–ముజామిల్‌‌‌‌ ముర్తజాపై గెలిచారు. డూ ఆర్‌‌‌‌ డై మ్యాచ్‌‌‌‌ కావడంతో బర్కతుల్లా ప్లేస్‌‌‌‌లో పాక్‌‌‌‌ సీనియర్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ అఖీల్‌‌‌‌ ఖాన్‌‌‌‌ను బరిలోకి దించినా విజయం దక్కలేదు.

ఇక 3–0తో మ్యాచ్‌‌‌‌ ఇండియా సొంతం కావడంతో ఒకే ఒక్క రివర్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ ఆడారు. ఇందులో  అరంగేట్రం ఆటగాడు నిక్కీ పూనచ 6–3, 6–4తో మహ్మద్‌‌‌‌ షోయబ్‌‌‌‌ను ఓడించాడు. తాజా గెలుపుతో ఇండియా సెప్టెంబర్‌‌‌‌లో జరిగే వరల్డ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌1 మ్యాచ్‌‌‌‌ల్లో తలపడనుండగా, పాక్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌–2లోనే కొనసాగనుంది.