కారును ఢీ కొట్టిన లారీ.. నలుగురు దుర్మరణం

కారును ఢీ కొట్టిన లారీ.. నలుగురు దుర్మరణం

కడప జిల్లా మైదుకూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రహ్మంగారిమఠం మండలం డి. అగ్రహారం సమీపంలో టమోటా లోడుతో వెళ్తున్న లారీ.. మారుతి కారును ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిలో నలుగురు స్పాట్ లోనే మృతిచెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్ కు తరలించారు. మృతులను కర్ణాటక మొగల్కోట్ కు చెందిన వారిగా గుర్తించారు. నెల్లూరులో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి ఉన్నారు. నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం కోసం బద్వేల్ ఆస్పత్రికి తరలించారు.