నెల రోజుల్లోనే 4 లక్షల కొత్త క్రెడిట్​ కార్డుల జారీ

నెల రోజుల్లోనే 4 లక్షల కొత్త క్రెడిట్​ కార్డుల జారీ

హైదరాబాద్​, వెలుగు: ఆర్​బీఐ బ్యాన్​ ఎత్తేసిన నెల రోజుల లోపే 4 లక్షల కొత్త క్రెడిట్​ కార్డులను జారీ చేసినట్లు హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ గ్రూప్​ పేమెంట్స్​ హెడ్​ పరాగ్​ రావు చెప్పారు. త్వరలోనే పోగొట్టుకున్న మార్కెట్​ షేర్​ను మళ్లీ చేజిక్కించుకుంటామనే ధీమాను వ్యక్తం చేశారు. ఇందుకోసం తమ వ్యూహం మార్చుకున్నామని, పార్టనర్‌‌షిప్​ల ద్వారా ముందుకు దూసుకెళ్లాలనుకుంటున్నామని కూడా పరాగ్​ రావు వెల్లడించారు. మెరుగైన క్రెడిట్​ కార్డులను అందుబాటులోకి తేవడం వల్లే రికార్డు స్థాయిలో 4 లక్షల కార్డులు జారీ చేయగలిగామని పేర్కొన్నారు. బ్యాంకింగ్​ రంగంలో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. టెక్నాలజీ ప్రాబ్లమ్స్​తో చాలాసార్లు డిజిటల్​ బ్యాంకింగ్​ ఎఫెక్ట్​ అవడం వల్ల కొత్త క్రెడిట్​ కార్డులు జారీ చేయొద్దనే నిబంధనను ఆర్​బీఐ  కిందటేడాది డిసెంబర్​లో విధించిన విషయం తెలిసిందే. ఈ బ్యాన్​ను ఆగస్టు మధ్యలో ఎత్తివేశారు. ఆ తర్వాత పేటీఎంతోనూ హెచ్​డీఎఫ్​సీ పార్టనర్‌‌షిప్​ అగ్రిమెంట్​ కుదుర్చుకుంది. కస్టమర్ల కోసం కొత్తగా మూడు కార్డులను లాంఛ్​ చేస్తున్నట్లు కూడా పరాగ్​ రావు చెప్పారు. ఫిబ్రవరి 2022 నాటికి నెలకు 5 లక్షల క్రెడిట్​ కార్డులు జారీ చేయాలని టార్గెట్​ పెట్టుకున్నామని పేర్కొన్నారు.