ఆర్మీ వెహికల్స్​పై టెర్రరిస్టుల దాడి ... నలుగురు జవాన్లు మృతి.

ఆర్మీ వెహికల్స్​పై టెర్రరిస్టుల దాడి ... నలుగురు జవాన్లు మృతి.

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్​లోని పూంచ్ జిల్లాలో టెర్రరిస్టులు మెరుపుదాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో సురన్ కోట్ ప్రాంతంలోని డేరాకీ గలీ నుంచి వెళ్తున్న రెండు ఆర్మీ వెహికల్స్ పై టెర్రరిస్టులు ఆకస్మిక దాడి చేశారని అధికారులు తెలిపారు. ఆపై వెంటనే ఎన్​కౌంటర్ ప్రారంభమైందన్నారు. స్పాట్​కు అదనపు బలగాలను పంపామని, గాయపడినోళ్లను ఆస్పత్రికి తరలించామని చెప్పారు. 

నెల రోజుల వ్యవధిలో సురన్ కోట్​లో సైన్యంపై ఆకస్మిక దాడి జరగడం ఇది రెండోసారి. ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా బుధవారం రాత్రి నుంచి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని, ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయని రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. కాగా, సురన్ కోట్   ప్రాంతం 2003 నుంచి ఎలాంటి టెర్రరిజం యాక్టివిటీస్ లేవు. 2021 తర్వాతే టెర్రరిస్టుల చొరబాట్లు, దాడులు మొదలయ్యాయి. గత రెండేండ్లలో ఈ ప్రాంతంలో జరిగిన దాడుల్లో 35 మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.