
- హెల్త్ కేర్ ఫార్మసీ పేరుతో హాస్పిటల్ ప్రారంభం
- అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్
హనుమకొండ, వెలుగు : బీ ఫార్మసీ మధ్యలోనే ఆపేసిన ఓ వ్యక్తి ఫేక్ సర్టిఫికెట్లతో వరంగల్లో డాక్టర్ అవతారం ఎత్తాడు. ఓ ల్యాబ్ టెక్నీషియన్తో కలిసి హాస్పిటల్ కూడా ఓపెన్ చేశాడు. ఇప్పటివరకు సుమారు 43 వేల మందికి ట్రీట్మెంట్ఇచ్చాడు. వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ నకిలీ డాక్టర్ గుట్టురట్టు చేశారు. రూ.1.9 లక్షల నగదు, ల్యాప్టాప్, సెల్ఫోన్లు, ల్యాబ్ఎక్విప్మెంట్ స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ సీపీ డా.తరుణ్ జోషి వివరాలు తెలియజేశారు. వరంగల్ కు చెందిన ముజతాబ అహ్మద్ బీ ఫార్మసీ మధ్యలోనే అపేశాడు. స్థానికంగా ఉన్న ఓ డాక్టర్ వద్ద అసిస్టెంట్ గా కొన్నేండ్లు పని చేశాడు. జీతం ఖర్చులకు చాలకపోవడంతో పెద్ద మొత్తంలో సంపాదించాలని ప్లాన్ వేశాడు. ఎయిమ్స్ లో చదివినట్టు ఫేక్ ఎంబీబీఎస్ సర్టిఫికెట్ తయారు చేసుకుని డాక్టర్ అవతారం ఎత్తాడు. తనకు పరిచయమున్న దామరకొండ సంతోష్ కుమార్ అనే ల్యాబ్ టెక్నీషియన్తో కలిసి వరంగల్ లోని చింతల్దగ్గర 'హెల్త్ కేర్ఫార్మసీ' పేరుతో 2018లో హాస్పిటల్ ఓపెన్చేశాడు.
పెద్ద రోగం పేరు చెప్పి రెఫర్
ముజతాబ అహ్మద్ పేషెంట్లకు తెలిసిన వైద్యం చేసేవాడు. అవసరం లేకున్నా తన ల్యాబ్లోనే టెస్టులు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజేవాడు. కొంతమందికి పెద్ద రోగాలొచ్చాయని చెప్పి ఇతర హాస్పిటల్స్కు రెఫర్ చేసేవాడు. దీనికి గాను పెద్ద మొత్తంలో కమీషన్ముట్టేది. ఇలా నాలుగేండ్లలో 43 వేల మందికి ట్రీట్మెంట్ చేశాడు. సమాచారం రావడంతో వరంగల్టాస్క్ఫోర్స్ సీఐలు నరేశ్కుమార్, వేంకటేశ్వర్లు హాస్పిటల్ లో తనిఖీలు చేసి ముజతాబ అహ్మద్ ను నకిలీ డాక్టర్గా తేల్చారు. ఇతడితో పాటు ల్యాబ్ టెక్నీషియన్ సంతోష్ కుమార్ ను అరెస్ట్ చేసి మిల్స్కాలనీ పీఎస్కు తరలించారు. సీఐలతో పాటు ఎస్సైలు లవణ్ కుమార్, అనిల్, హెడ్ కానిస్టేబుల్స్ శ్యాంసుందర్, సోమలింగం, అశోక్, మాధవరెడ్డి, స్వర్ణలత, శ్రవణ్ కుమార్, సృజన్, రాజేశ్, నవీన్, అలీ, శ్రీను, నాగరాజు, సురేశ్, రాజు, భిక్షపతి, శ్యామ్, శ్రీధర్లను సీపీ డా.తరుణ్ జోషి అభినందించారు.