
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో రోజురోజుకు ఎండలు పెరుగుతున్నాయి. ఆదివారం జిల్లాలో అత్యధికంగా డొంగ్లిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మగ్ధంపూర్లో 43.7 డిగ్రీలు, బిచ్కుందలో 43.6, పిట్లంలో 43.4, రామారెడ్డిలో 42.7, బొమ్మదేవునిపల్లిలో 42.6, మేనూర్లో 42.5, హసన్పల్లిలో 42.4, సర్వాపూర్లో 42.3, నాగిరెడ్డిపేట, మాచాపూర్లో 42.2, వెల్పుగొండ, పెద్దకొడప్గల్లో 41.9, బీబీపేట, పాతరాజంపేటల్లో 41.8, తాడ్వాయి, లింగంపేటల్లో 41.4 , భిక్కనూరులో 41.3, గాంధారి, కొల్లూర్ల్లో 41.2 డిగ్రీల చొప్పున, దోమకొండ, ఆర్గొండల్లో 41.1, పుల్కల్లో 41, నస్రుల్లాబాద్లో 40.9, సోమూర్లో40.7, లచ్చాపేట 40.6, జుక్కల్లో 40.5, బీర్కుర్, ఇసాయిపేటల్లో 40.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది.