
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతి రోజూ భారీ సంఖ్యలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 443 కరోనా కేసులు నమోదైనట్లు ఏపీ ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది. ఈ ఒక్క రోజులోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9372కు చేరిందని చెప్పింది. అందులో 4,435 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కాగా, 111 మంది మరణించారని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4826 మంది వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల్లో 392 లోకల్స్ కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 44 మంది, విదేశాల నుంచి వచ్చిన వారు ఏడుగురు ఉన్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది.